Share News

వంటావార్పుతో గిరిజనుల నిరసన

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:01 AM

మండలంలోని కొండగంగుబూడి ఎస్సీ, ఎస్టీ యువకులు ఉపాధి కల్పించాలని 15 రోజులుగా ఆందోళన చేపడుతున్నా జిల్లా అధికారులకు చీమకుట్టినట్టు లేకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్‌ ఆరోపించారు

   వంటావార్పుతో గిరిజనుల నిరసన
భోజనప్లేట్లు పట్టి ఆందోళన చేపడుతున్న గిరిజన యువత

వేపాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండగంగుబూడి ఎస్సీ, ఎస్టీ యువకులు ఉపాధి కల్పించాలని 15 రోజులుగా ఆందోళన చేపడుతున్నా జిల్లా అధికారులకు చీమకుట్టినట్టు లేకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్‌ ఆరోపించారు.బుధవారం బొద్దాం-కొండగంగుబూడి రోడ్డులో వంటావార్పు నిర్వహణలో భాగంగా భోజన ప్లేట్లు పట్టుకొని గిరిజనులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో చల్లా వెంకటరావు, పాతబోయిన అర్జున, కేదాటి గిరి, బోర అవతారం, పొట్నూరి.సంతోష్‌, కుమ్మరి గణేష్‌, నర్సింగరావు పాల్గొన్నారు.

-

Updated Date - Aug 06 , 2026 | 12:01 AM