ఏడో రోజుకు గిరిజనుల నిరసన
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:31 AM
చెరువులు అప్పగించి, ఉపాధి కల్పించాలని కోరుతూ గత ఏడు రోజులుగా గిరిజనులు నిరసన చేస్తున్నా జిల్లా అధికారులు గానీ, నాయకులు గానీ పట్టించుకోకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వేపాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): చెరువులు అప్పగించి, ఉపాధి కల్పించాలని కోరుతూ గత ఏడు రోజులుగా గిరిజనులు నిరసన చేస్తున్నా జిల్లా అధికారులు గానీ, నాయకులు గానీ పట్టించుకోకపోవడం దారుణమని జిల్లా రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండగంగుబూడిలో గురువారం చేపట్టిన నిరసనలో సార మాస్, సార గణేష్, సార గవురమ్మ, సార కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు.