ఐదో రోజుకు గిరిజనుల నిరసన
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:25 AM
చేపల పెంపకానికిగాను విజయరామసాగర్ చెరువును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కొండగంగుబూడి పంచాయతీలోని సొంటివానిపాలెం, చిట్టివానిపాలెం గిరిజనులు చేపడుతున్న నిరసన శనివారం ఐదో రోజుకు చేరుకుంది.
చేపల చెరువును అప్పగించాలని డిమాండ్
వేపాడ, జూలై 25(ఆంధ్రజ్యోతి): చేపల పెంపకా నికిగాను విజయరామసాగర్ చెరువును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కొండగంగుబూడి పంచాయతీలోని సొంటివానిపాలెం, చిట్టివానిపాలెం గిరిజనులు చేపడుతున్న నిరసన శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఈమేరకు వారు విజయరామ సాగర్ చెరువు గట్టుపై టెంట్ వేసి వంటా-వార్పుతో ఆందోళన చేపట్టారు. జిల్లా రైతు సంఘం నాయకు డు చల్లా జగన్ సారథ్యంలో ఈ ఆందోళన చేపడు తున్నారు.