Share News

Temples రేపు దేవాలయాల మూసివేత

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:34 AM

Temples to Remain Closed Tomorrow చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలను మూసివేయనున్నారు. 4న బుధవారం ఆలయాలన్నింటిలో సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Temples   రేపు దేవాలయాల మూసివేత
తోటపల్లిలో కోదండరామ, వేంకటేశ్వరస్వామి దేవాలయాలు..

గరుగుబిల్లి, మార్చి1(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలను మూసివేయనున్నారు. 4న బుధవారం ఆలయాలన్నింటిలో సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలను ఈ నెల 3న మూసివేయనున్నట్లు ఈవో బి.శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉదయం 10 గంటలకు ఉభయ దేవాలయాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. 4న గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి స్వామివారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లావాసులు గమనించాలని ఆయన కోరారు. పాలకొండలో కోటదుర్గమ్మ, శంబర పోలమాంబ దేవాలయాలతో పాటు జిల్లాలో ఇతర ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా శంబరలో ఐదోవారం జాతర నిర్వహించడం లేదని దేవాలయ సిబ్బంది తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 12:34 AM