Intermediate Students ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:42 PM
Special Classes for Intermediate Students నీట్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హర గోపాల్ తెలిపారు.
కురుపాం, జూలై25(ఆంధ్రజ్యోతి): నీట్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హర గోపాల్ తెలిపారు. విద్యార్థులు ఈ క్లాసులను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించాలని కోరారు. శనివారం కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్ను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు , నోట్ బుక్స్, లెర్నింగ్ మెటీరియల్ను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో చదివి .. లక్ష్యాల సాధనకు తీవ్రంగా కృషి చేయాలన్నారు. కురుపాం కళాశాల విద్యార్ధి నీట్లో మెరిసి అమరావతిలో ఫ్రీ సీట్ సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ఏడాది కూడా మంచి ర్యాంక్లు సాధించాలన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ఎం.కుమారస్వామి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.