ఫిర్యాదులను పరిష్కరించండి: ఎస్పీ
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:23 AM
ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిం చి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు.
బెలగాం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిం చి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన వినతులను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్య లను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ రమణ, ఎస్ఐ శిరీష పాల్గొన్నారు.