Postal Services గిరిజనుల చెంతకు తపాలా సేవలు
ABN , Publish Date - May 15 , 2026 | 11:41 PM
Postal Services Reach Tribal Communities గిరిజన ప్రాంత ప్రజలకు తపాలా సేవలను అందజేయాలని విశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నవీన్ కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో పార్వతీపురం సబ్ డివిజన్ పరిధిలోని తపాలా ఉద్యోగులతో సమీక్షించారు.
బెలగాం, మే15(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత ప్రజలకు తపాలా సేవలను అందజేయాలని విశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.నవీన్ కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో పార్వతీపురం సబ్ డివిజన్ పరిధిలోని తపాలా ఉద్యోగులతో సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మొండెంకల్లు, కొమరాడ పరిధిలో పోస్టాఫీస్ల ద్వారా గిరిజనులకు అన్ని రకాల సేవలు అందించాలన్నారు. ఆర్థిక సేవలతో పాటు ఇన్సూరెన్స్ , ఆధార్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరవేయాలని సూచించారు. తపాలా సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.