Share News

‘పారదర్శకంగా సర్‌ చేపట్టండి’

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:32 AM

ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)ను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్‌ సీహెచ్‌.రాధాకృష్ణ మూర్తి ఆదేశించారు.

‘పారదర్శకంగా సర్‌ చేపట్టండి’
మాట్లాడుతున్న తహసీల్దార్‌ రాధాకృష్ణమూర్తి

పాలకొండ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్‌)ను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్‌ సీహెచ్‌.రాధాకృష్ణ మూర్తి ఆదేశించారు. బుధవారం ఆయన నగర పంచాయతీలో సర్‌ ప్రక్రియను కమిషనర్‌ నూకరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులు, పేరు, చిరునామా మార్పులు, ఒకే వ్యక్తికి డూప్లికేట్‌ నమోదులు, మృతి చెందిన ఓటర్ల పేర్లు, అర్హత కలిగిన నమోదులు వంటి అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:32 AM