one-Minute Delay నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:11 AM
No Entry Even for a One-Minute Delay జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు.
జిల్లాలో 37 కేంద్రాల ఏర్పాటు
సకాలంలో విద్యార్థులు చేరుకోవాలి
డీఐఈవో నాగేశ్వరరావు
జియ్యమ్మవలస, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన చినమేరంగిలో విలేఖర్లతో మాట్లాడుతూ... ‘ జిల్లాలో 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులు సమయానికి పరీక్షా హాల్లో ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిటింగ్ స్క్వాడ్లు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ (డీఈసీ), కన్వీనర్ డీఐఈవో ఈ పరీక్షలను పర్యవేక్షిస్తారు. 57 మందిని ఇన్విజిలేటర్లు నియమించాం. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించబోం. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో బోటనీ, జువాలజీ కాకుండా ఈ రెండింటినీ కలపి బయాలజీ పేపరే ఉంటుంది. మేథ్స్ పేపర్ కూడా ఒకటే ఉంటుంది. కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం. పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయి. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 14 కేజీబీవీలు, 9 సోషల్ వెల్ఫేర్, 9 ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు, 4 మోడల్ స్కూళ్లు, 34 ప్రైవేట్ కళాశాలలు, రెండు హైస్కూల్ ప్లస్లు ఉన్నాయి. వాటిల్లో వాటిలో 17,530 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత నెల 27 నుంచి ఈనెల 10 వరకు మూడు విడతలుగా ఒకేషనల్ ప్రాక్టికల్స్, ఈనెల 1 నుంచి 10వ తేదీ వరకు రెండు విడతలుగా జనరల్ ప్రాక్టికల్స్ నిర్వహించాం.’ అని తెలిపారు.