కనీస వేతనాలు అమలు చేయాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:55 PM
కనీస వేతనాలు అమలు చేయాలని ఆశవర్కర్ల యూనియన్ నాయకురాలు పి.నాగమణి డిమాండ్ చేశారు.
పాచిపెంట రూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కనీస వేతనాలు అమలు చేయాలని ఆశవర్కర్ల యూనియన్ నాయకురాలు పి.నాగమణి డిమాండ్ చేశారు. మంగళవారం పాచిపెంట, గరువునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు కోరాడ ఈశ్వరరావు, కె.నిర్మల, దాలమ్మ, గౌరి పాల్గొన్నారు.