రైలు ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 12:35 AM
గరివిడి మండలం కొండపల్లిపురం సమీపంలో సోమవారం రైలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చందక ఆదినారా యణ(55) అక్కడికక్కడే మృతిచెందారు.
గరివిడి, మే 4(ఆంధ్రజ్యోతి): గరివిడి మండలం కొండపల్లిపురం సమీపంలో సోమవారం రైలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చందక ఆదినారా యణ(55) అక్కడికక్కడే మృతిచెందారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఆదినారాయణ పొందూరులో రైల్వే గ్యాంగ్మన్గా పనిచేస్తున్నారు. సోమవారం సెలవు కావడంతో పొలానికి వెళ్లేందుకు రైల్వే ట్రాకు దాటుతుండగా ఈ ప్రమా దం చోటుచేసుకుందని శ్రీకాకుళం రైల్వే పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మధుసూదనరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.