Share News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:08 AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులో నిర్వహించిన స్వచ్ఛాం ద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆమె తన కారును వాడలేదు. అధికారులు, శ్రేణులతో కలిసి స్కూటీపై ఇంటి నుంచి మున్సిపల్‌ కార్యా లయం వరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచిం చారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సాలూరులో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్న సంధ్యారాణి:

మక్కువ రూరల్‌(సాలూరు), మే16(ఆంధ్రజ్యో తి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులో నిర్వహించిన స్వచ్ఛాం ద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆమె తన కారును వాడలేదు. అధికారులు, శ్రేణులతో కలిసి స్కూటీపై ఇంటి నుంచి మున్సిపల్‌ కార్యా లయం వరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచిం చారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఫబెలగాం, మే 16 (ఆంధ్రజ్యోతి): పార్వతీ పురంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛత దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వరరావుతోపాటు పోలీసులు పిచ్చి మొక్కలను తొలగించారు.

Updated Date - May 17 , 2026 | 12:08 AM