Share News

జీవో-77 రద్దుచేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:09 AM

పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాల ర్‌షిప్‌ బకాయిల విడుదల చేయడంతోపాటు పీజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో - 77 రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.

 జీవో-77 రద్దుచేయాలి
ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు :

బొబ్బిలి రూరల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాల ర్‌షిప్‌ బకాయిల విడుదల చేయడంతోపాటు పీజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో - 77 రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈమేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో బొబ్బిలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జేవీఎస్‌ రామమోహనరావు, తహసీల్దార్‌ ఎం.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.నాగభూషణం, ఏఎస్‌ఐఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వి.శ్రావణ్‌కుమార్‌, ఉపా ఽధ్యక్షులు ఎ.చరణ్‌తేజ, గణేష్‌, వికాస్‌, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:09 AM