గిరిజన ప్రాంతాల్లో వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:18 AM
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. మంగళవారం నల్లికి క్కువ సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభిం చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిశిఖర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నా మన్నారు. గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, ఉపాధి తదితర కనీస వసతులు కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు డొంకాడ రామకృష్ణ, నాయకులు పాడి సుధ, బిడ్డిక, పద్మ, టీడీపీ మండల అధ్యక్షుడు అడ్డాకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.