అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
ABN , Publish Date - May 04 , 2026 | 12:17 AM
మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గొల్ల షణ్ముఖరావు(29) ఆదివారం మృతిచెందారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
వేపాడ, మే 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గొల్ల షణ్ముఖరావు(29) ఆదివారం మృతిచెందారు. విశాఖపట్నం 198 బెటాలియన్కు చెందిన ఈయన అనారోగ్యంతో మృతిచెందగా.. స్థానిక సీఐ కృష్ణారావు సిబ్బంది సారథ్యంలో ఆయన మృతదేహా న్ని స్వస్థలం బొద్దాంకు తీసుకువచ్చారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. షణ్ముఖరావు నాలుగేళ్ల కిందటే ఉద్యోగంలో చేరారు.