కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:24 AM
వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు రెగ్యులర్ చేయాలని డిమాండ్చేశారు.
పార్వతీపురంలో జిల్లా కేంద్రాసుపత్రి వద్ద నిరసన
పార్వతీపురం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు రెగ్యులర్ చేయాలని డిమాండ్చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం లోని జిల్లా కేంద్రాసుపత్రి వద్ద 14వరోజు మోకాళ్లపై నిలబడి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.