ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:12 AM
ప్రత్యేక టెట్ నోటిఫికేషన్పై అవసర మైన మార్పులు చేయాలని కోరుతూ ఎస్టీయూ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
డీఆర్వో అరుణకుమారికి ఉపాధ్యాయుల వినతి
విజయనగరం, కలెక్టరేట్ ఆగస్టు 27(ఆంధ్ర జ్యోతి): ప్రత్యేక టెట్ నోటిఫికేషన్పై అవసర మైన మార్పులు చేయాలని కోరుతూ ఎస్టీయూ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈసం దర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ టెట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వ హించాలని కోరారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుకు మాత్రమే సిలబస్ పరిమితం చేయాలన్నారు. అనంతరం ఇన్చార్జి డీఆర్వో అరుణకుమారికి వినతిపత్రం సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పారావు, కార్యదర్శి శ్యామ్, నాయ కులు గోవింద, దొర, రమేష్, మురళి పాల్గొన్నారు.