బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:26 AM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బూత్లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు.
బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు
రామభద్రపురం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బూత్లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. శనివారం రామభద్రపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మండలంలోని 49 పోలింగ్ బూత్ల్లో కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. కొత్త ఓటర్లు నమోదుకు స్పెషల్డ్రైవ్ నిర్వహి స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగపండు గోపాలనాయు డు, ఎంఈవో ఆమిటి తిరుమలప్రసాద్, బీఎల్వోలు పాల్గొన్నారు.