Share News

mustabu తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:39 PM

Biyyala Valasa Village Gets a First mustabu జిల్లాలో తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిశుభ్రత, రక్షిత నీరు, మురుగునీరు నిల్వ లేకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్థులు పారిశు ఽఽధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుసుకున్నారు.

  mustabu  తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస
బియ్యాలవలస గ్రామంలో కలెక్టర్‌ ప్రభుత్వ విప్‌, ఇతర ఉన్నతాధికారులు

కురుపాం రూరల్‌, జనవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి ముస్తాబు గ్రామం బియ్యాలవలస అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అక్కడ పరిశుభ్రత, రక్షిత నీరు, మురుగునీరు నిల్వ లేకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్థులు పారిశు ఽఽధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే బియ్యాలవలస గ్రామాన్ని అం దరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజున గ్రామస్థులను సత్కరిస్తామని ప్రకటించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి , జేసీ యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌. వైశాలి, స్వప్నిల్‌ జగన్నాఽథ్‌, డీపీవో కొండలరావు, ట్రైౖకార్‌ డైరెక్టర్‌ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

రోగులకు అండగా నిలవాలి..

కురుపాం: రోగులకు అండగా నిలవడమే ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ ప్రఽదాన ఉద్దేశమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కురుపాం ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌లో విద్యార్థులు, యువత, రిటైర్డు ఉద్యోగులు భాగస్వాములవ్వాలి. ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవలందిస్తూ.. ఆదర్శంగా నిలవాలి. ఆసుపత్రుల్లో ఏ డాక్టర్‌ను కలవాలో, ఎక్కడ ల్యాబ్‌ పరీక్షలు చేయించుకోవాలో.. ఎలా మందులు వాడాలో తెలియక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి వలంటీర్లు పూర్తిగా సహకరించాలి. ’ అని కలెక్టర్‌ కోరారు.

Updated Date - Jan 07 , 2026 | 11:39 PM