Share News

ఘనంగా భీష్మ ఏకాదశి

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:19 PM

జిల్లా వ్యాప్తంగా గురువారం భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి.

ఘనంగా భీష్మ ఏకాదశి
సాలూరు కన్యాకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమ పూజలు చేస్తున్న మహిళలు

సాలూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం భీష్మ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా సాలూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు.

Updated Date - Jan 29 , 2026 | 11:19 PM