Healthcare Services మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:21 PM
Better Healthcare Services the Goal ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు మహిళా కళాశాల ప్రిన్సిపాల్(ఆర్టీసీ)గా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు.
పార్వతీపురం, జూలై16(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు మహిళా కళాశాల ప్రిన్సిపాల్(ఆర్టీసీ)గా విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్య తలు స్వీకరించారు. కాగా ఇప్పటివరకు మన్యం డీఎంహెచ్వోగా ఉన్న భాస్కరరావు విశాఖకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమితులైన విజయలక్ష్మి విలేఖర్లతో మాట్లాడుతూ.. జిల్లాలో మలేరియా, టైఫాయిడ్ , జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటా మన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకుం టామని వెల్లడించారు. అనంతరం ఆమె కలెక్టర్ ప్రభాకర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.