‘అన్నదాత సుఖీభవ’ మంజూరు చేయాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:35 AM
మండలంలోని గుడివాడలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన భూములకు రెండు సంవత్సరాలు నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు జమకావడంలేదని, తక్షణమే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
పాలకొండ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడివాడలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన భూములకు రెండు సంవత్సరాలు నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు జమకావడంలేదని, తక్షణమే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈమేరకు సోమవారం వైసీపీ మండలాధ్య క్షుడు కనపాక సూర్య ప్రకాశరావు, లుంబూరు సర్పంచ్ తిర్లంగి ఉపేంద్రకు మార్తో కలిసి రైతులు వినతిపత్రాన్ని తహసీల్దార్ రాధాకృష్ణకు అందించారు.