79 పంచదార ప్యాకెట్లు సీజ్
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:26 AM
మండలంలోని నిడగల్లు గ్రామంలో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం 606 కేజీలు, పంచదార 79 ప్యాకెట్లు(39.50కిలోలు) స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సీతానగరం, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): మండలంలోని నిడగల్లు గ్రామంలో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం 606 కేజీలు, పంచదార 79 ప్యాకెట్లు(39.50కిలోలు) స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు 6ఏ కేసు నమోదు చేశారు. అక్రమంగా రేషన్ సరుకుల నిల్వ చేసినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ ప్రసన్న కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి డి.అశోక్, ఆర్ఐ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.