టీడీపీలో 50 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:27 AM
బాడంగి మండలంలోని బొత్సవానివలస పంచాయతీ పరిధిలోని హరిజనపాల్తేరు గ్రామానికి చెందిన 50 కుటుంబాల శనివారం టీడీపీలో చేరాయి.
బొబ్బిలి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బాడంగి మండలంలోని బొత్సవానివలస పంచాయతీ పరిధిలోని హరిజనపాల్తేరు గ్రామానికి చెందిన 50 కుటుంబాల శనివారం టీడీపీలో చేరాయి. ఈ మేరకు బొబ్బిలిలోని దర్బారుమహల్లో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో మాజీ ఎంపీపీలు బొంతు త్రినాథ, యజ్జల లక్ష్మి, అలజంగి రాముల ఆధ్వర్యంలో చేరారు.