Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:17 PM

మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మృతుడు సతీశ్‌ (ఫైల్‌ ఫొటో)

ఇద్దరికి తీవ్ర గాయాలు

అనంతగిరి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి ఏఎస్‌ఐ రాజంనాయుడు తెలిపిన వివరాలా ఉన్నాయి. విశాఖలోని గోపాలపట్నం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన నామాల సతీశ్‌(19), లాలం తేజ, శ్రీను శనివారం ద్విచక్ర వాహనంపై లంబసింగి వచ్చారు. అనంతరం అరకు అందాలను తిలకించి సోమవారం ఉదయం విశాఖపట్నం బయలుదేరారు. అయితే చిలకలగెడ్డ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సతీశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, లాలం తేజ, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సతీశ్‌ విశాఖలోని అల్వార్‌దాస్‌ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఏఎస్‌ఐ రాజంనాయుడు కేసు నమోదు చేసి మృతదేహానికి ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Jan 26 , 2026 | 11:17 PM