Share News

నేడు మాడగడ సర్‌రైజ్‌ వద్ద యెగాంధ్ర వేడుకలు: కలెక్టర్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:41 PM

ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అరకులోయ మండలం మాడగడ సర్‌రైజ్‌ పాయింట్‌ వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు మాడగడ సర్‌రైజ్‌ వద్ద యెగాంధ్ర వేడుకలు: కలెక్టర్‌

పాడేరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అరకులోయ మండలం మాడగడ సర్‌రైజ్‌ పాయింట్‌ వద్ద యోగాంధ్ర వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా టూరిజం థీమ్‌తో యోగాంధ్రను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సూచించిన డ్రెస్‌ కోడ్‌తో శనివారం ఉదయం 5.30 గంటలకే వేదిక వద్దకు రావాలని, కార్యక్రమంలో యువత, విద్యార్థులు, ప్రజలు, అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ నిషాంతి కోరారు.

Updated Date - Jun 19 , 2026 | 10:41 PM