అనకాపల్లిని సుందరంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:04 AM
అనకాపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
మేయర్ పీలా, ఎమ్మెల్యే కొణతాల
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
అనకాపల్లి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ పరిధిలోని 82, 83, 84 వార్డుల్లో కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖనగరంతోపాటు అనకాపల్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గాంధీనగరంలోని పార్కును పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.