లంబసింగి ఘాట్లో ట్రాఫిక్కు అంతరాయం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:13 AM
నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్ తొలి మలుపు వద్ద సాంకేతిక సమస్యలో భారీ లారీ నిలిచిపోయింది.
సాంకేతిక సమస్యతో లారీ నిలిచిపోయి ఇబ్బందులు
చింతపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారి లంబసింగి ఘాట్ తొలి మలుపు వద్ద సాంకేతిక సమస్యలో భారీ లారీ నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బుధవారం మధ్యాహ్నం మైదాన ప్రాంతాల నుంచి ఓ లారీ సిమెంట్ లోడుతో చింతపల్లి వస్తున్నది. లంబసింగి ఘాట్ తొలిమలుపు వద్ద సాంకేతిక సమస్యతో లారీ నిలిచిపోయింది. ఈ మలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండడంతో భారీ వాహనాలు, బస్సుల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.