జాతీయ హాకీ పోటీలకు ముగ్గురు ఎంపిక
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:46 AM
బాలురు సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ కె.నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎలమంచిలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బాలురు సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ కె.నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బిహార్ రాష్ట్రం రాజ్గిర్లో జరుగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఎలమంచిలికి చెందిన కె.సూర్య ప్రదీప్, ఎల్.చైతన్య, నక్కపల్లికి చెందిన దేవేందర్ వెంకట్ పాల్గొన్నట్టు పేర్కొన్నారు. హాకీ జట్టు కోచ్గా ఎలమంచిలికి చెందిన కె.లోకేశ్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు జి.రాంబాబు, ఎస్.రమేశ్, డి.మహేశ్ అభినందించారు.