Share News

వణుకుతున్న గిరిజనం

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:37 PM

మన్యంలో శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో గతకొన్ని రోజులుగా పొగమంచు దట్టంగానే కురుస్తున్నది.

వణుకుతున్న గిరిజనం
పాడేరు మెయిన్‌ రోడ్డులో శుక్రవారం ఉదయం కమ్మేసిన పొగమంచు

దట్టంగా పొగమంచు

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో గతకొన్ని రోజులుగా పొగమంచు దట్టంగానే కురుస్తున్నది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల దట్టంగా పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. చలికి ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతూ ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది.

ముంచంగిపుట్టులో 8.2 డిగ్రీలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ముంచంగిపుట్టులో శుక్రవారం 8.2డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. పెదబయలులో 9.0, జి.మాడుగులలో 9.8, హుకుంపేటలో 12.8, అరకులోయలో 13.1, పాడేరులో 13.2, చింతపల్లిలో 14.1, కొయ్యూరులో 16.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jan 02 , 2026 | 10:37 PM