గిడుగు రామ్మూర్తి పురస్కారానికి తెలుగు ఉపాధ్యాయుడు ఎంపిక
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:49 AM
అనకాపల్లి మండలం కూండ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోరాడ అప్పలరాజు, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు.
తుమ్మపాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కూండ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోరాడ అప్పలరాజు, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు, సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించనున్న కార్యక్రమంలో అప్పలరాజు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలుగు భాష, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలందించినందుకు అప్పలరాజును గిడుగు రామ్మూర్తి పురస్కారానికి ఎంపికచేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు.