సమస్యలపై చట్టసభల్లో మాట్లాడండి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:29 PM
గిరిజనుల సమస్యలపై తాము నిర్వహించే సభల్లో కాకుండా చట్టసభల్లో ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు నిలదీశారు.
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీసిన అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు
పాడేరు, జూలై 17(ఆంధ్రజ్యోతి):
గిరిజనుల సమస్యలపై తాము నిర్వహించే సభల్లో కాకుండా చట్టసభల్లో ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు నిలదీశారు. జీవో నంబరు3, 1/70 చట్టంపై శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. జీవో నంబరు 3 రద్దు, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చట్టసభల్లో మాట్లాడకుండా, స్థానిక సభల్లోనే పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో మాట్లాడతారని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. జీవో 3 రద్దు సమయం(2020)లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం అన్యాయమన్నారు.