సజావుగా ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:47 PM
జిల్లాలోని 11 మండలాల్లో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్ష సజావుగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు.
జిల్లాలో ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు 4,510 మంది విద్యార్థులు హాజరు
358 మంది గైర్హాజరు
పాడేరురూరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 మండలాల్లో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్ష సజావుగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీషు పరీక్షకు 4,868 మంది జనరల్, ఒకేషనల్ గ్రూపు విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,510 మంది హాజరయ్యారని, 358 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.