అర్జీలు స్వీకరించిన లోకేశ్
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:09 AM
జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ మంత్రి నారా లోకేశ్ సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ మంత్రి నారా లోకేశ్ సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం జిల్లా పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్ఎన్ఎస్ రాజు, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.