ఐఏఎస్ అధికారుల క్రికెట్ పోటీల్లో సత్తా
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:42 PM
విజయవాడలో ఐఏఎస్ అధికారుల క్రికెట్ పోటీల్లో తమ ప్రతిభ చాటి కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ జట్టు చాంపియన్గా నిలిచింది.
చాంపియన్గా నిలిచిన కలెక్టర్ దినేశ్కుమార్ జట్టు
పాడేరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఐఏఎస్ అధికారుల క్రికెట్ పోటీల్లో తమ ప్రతిభ చాటి కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ జట్టు చాంపియన్గా నిలిచింది. నిత్యం పరిపాలనా వ్యవహారాలతో తలమునకలవుతున్న ఐఏఎస్ అధికారులకు ఊరట కలిగించేందుకు విజయవాడలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ఐఏఎస్ అధికారులతో కూడిన జట్లు పాల్గొన్నాయి. కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న జట్టు ఈ పోటీల్లో చాంపియన్గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రికెట్ పోటీల్లో చాంపియన్గా తమ జట్టు విజయం సాధించడంపై కలెక్టర్ దినేశ్కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.