ఉత్తమ సేవా అవార్డుకు గౌరీ పీఏసీఎస్ ఎంపిక
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:44 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనుబంధంతో నిర్వహిస్తున్న గౌరీ పీఏసీఎస్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ సేవలకు గాను బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డుకు ఆప్కాబ్ గత నెల 31న ఎంపిక చేసినట్టు గౌరీ పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కర్రి మహాలక్ష్మినాయుడు తెలిపారు.
కొత్తూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనుబంధంతో నిర్వహిస్తున్న గౌరీ పీఏసీఎస్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ సేవలకు గాను బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డుకు ఆప్కాబ్ గత నెల 31న ఎంపిక చేసినట్టు గౌరీ పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కర్రి మహాలక్ష్మినాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు తెలియజేయగా పర్సన్ ఇన్చార్జితో పాటు బ్యాంకు పాలకవర్గ సభ్యులు కాండ్రేగుల లోకేశ్వరరావు, యల్లపు శ్రీనులను ఎమ్మెల్యే అభినందించారు. కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ 63వ ఫౌండేషన్ వేడుకలను పురస్కరించుకొని ఈ అవార్డును ఈ నెల 4న విజయవాడ గవర్నర్పేటలో ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అందజేయనున్నారని తెలిపారు. పర్సన్ ఇన్చార్జి మహాలక్ష్మినాయుడును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, తదితరులు పాల్గొన్నారు.