Share News

శృంగవరం పంచాయతీకి గుడ్‌ గవర్నెన్స్‌ అవార్డు

ABN , Publish Date - May 17 , 2026 | 12:32 AM

జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీల విభాగంలో గుడ్‌ గవర్నెన్స్‌- 2026 జాతీయ అవార్డును నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదానం చేశారు.

శృంగవరం పంచాయతీకి గుడ్‌ గవర్నెన్స్‌ అవార్డు
సీఎం చంద్రబాబు నుంచి నాతవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీకి గుడ్‌ గవర్నెన్స్‌ జాతీయ అవార్డు అందుకుంటున్న డీపీవో సందీప్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు

- అధికారులకు సీఎం సత్కారం

అనకాపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీల విభాగంలో గుడ్‌ గవర్నెన్స్‌- 2026 జాతీయ అవార్డును నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదానం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన పలు పంచాయతీల ప్రతినిధులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా నాతవరం మండలానికి చెందిన శృంగవరం గ్రామ పంచాయతీకి గుడ్‌ గవర్నెన్స్‌-2026 జాతీయ అవార్డుతో పాటు రూ.కోటి ప్రోత్సాహక నిధిని జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్‌, శృంగవరం పంచాయతీ కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి, గ్రామాభివృద్ధికి వారు చేసిన కృషిని అభినందించారు.

Updated Date - May 17 , 2026 | 12:32 AM