Share News

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:12 PM

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కలెక్టరేట్‌ ఆవరణలో మొక్క నాటి నీరు పోస్తున్న జేసీ టి.శ్రీపూజ

ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.శ్రీపూజ

కలెక్టరేట్‌ ఆవరణలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’

పాడేరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకుని కలెక్టరేట్‌ పరిసరాల్లో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలో పరిశుభ్రతా చర్యలు చేపట్టి, మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ఆమె స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చే యించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనీయాలన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను భూమిలో కలపకుండా, నిర్థేశిత ప్రదేశాల్లో మాత్రమే పారబోయాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీపూజ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:12 PM