జనగణనలో జిల్లా ముందంజ
ABN , Publish Date - May 20 , 2026 | 12:07 AM
జనగణన- 2027లో జిల్లా ముందంజలో ఉంది. సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ మంగళవారం రాష్ట్రంలోని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సెన్సస్కు సంబంధించిన ప్రక్రియను జిల్లా యంత్రాంగం 95 శాతం పూర్తి చేసిందని, దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన కలెక్టర్ నిషాంతి, జేసీ శ్రీపూజ, డీఆర్వో లోకేశ్వరరావు, యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
- 95 శాతం సెన్సస్ పూర్తితో రాష్ట్రంలో ప్రథమ స్థానం
- కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్
పాడేరు, మే 19 (ఆంధ్రజ్యోతి): జనగణన- 2027లో జిల్లా ముందంజలో ఉంది. సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ మంగళవారం రాష్ట్రంలోని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సెన్సస్కు సంబంధించిన ప్రక్రియను జిల్లా యంత్రాంగం 95 శాతం పూర్తి చేసిందని, దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన కలెక్టర్ నిషాంతి, జేసీ శ్రీపూజ, డీఆర్వో లోకేశ్వరరావు, యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.