Share News

‘సర్‌’పై టీడీపీ వర్కుషాపునకు జిల్లా నేతలు

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:04 AM

ఓటర్లకు సంబంధించి త్వరలో చేపట్టనున్న ‘స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)’పై మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వర్కుషాపునకు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.

‘సర్‌’పై టీడీపీ వర్కుషాపునకు జిల్లా నేతలు

ఎలమంచిలి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

ఓటర్లకు సంబంధించి త్వరలో చేపట్టనున్న ‘స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)’పై మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వర్కుషాపునకు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పలు సూచనలు చేశారు. ‘సర్‌’ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘సర్‌’పై శిక్షణతోపాటు ఓటరు జాబితాల రివిజన్‌పై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు, మళ్ల సురేంద్ర, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jun 03 , 2026 | 01:04 AM