సీలేరు చేరిన సైకిల్ యాత్ర
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:11 PM
విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి సైకిల్పై బయలు దేరిన విజయవాడకు చెందిన పాతగుంట శివ ఆదివారం సీలేరు చేరుకుని స్థానిక మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి బయలుదేరిన యువకుడు
సీలేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి పూరి క్షేత్రానికి సైకిల్పై బయలు దేరిన విజయవాడకు చెందిన పాతగుంట శివ ఆదివారం సీలేరు చేరుకుని స్థానిక మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాను విజయవాడలో ఈ నెల 11న బయలుదేరి భద్రాచలం మీదుగా ఆదివారం ఉదయం సీలేరు చేరుకున్నానని తెలిపారు. ఇక్కడ నుంచి నర్సీపట్నం, విశాఖపట్నం మీదుగా ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రానికి వెళతానని చెప్పాడు.