Share News

కంట్రోల్‌ రూమ్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:48 PM

విపత్కర పరిస్థితుల్లో సహాయానికి, సమస్యలను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కంట్రోల్‌ రూమ్‌ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి

జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి

టోల్‌ ఫ్రీ నంబర్‌: 08935-293448

పాడేరు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): విపత్కర పరిస్థితుల్లో సహాయానికి, సమస్యలను అధికారులకు తెలిపేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ప్రజలు తమ సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కంట్రోల్‌ రూమ్‌ దోహదపడుతుందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ సమస్యలను టోల్‌ ఫ్రీ నంబర్‌ 08935-293448కు కాల్‌ చేసి తెలపాలన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని ఇన్‌చార్జిలుగా నియమించామని, సమస్యలపై సమాచారం స్వీకరించి వెంటనే సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వివరాలను అందిస్తారన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:48 PM