Share News

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:10 AM

మండలంలోని గజిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్‌ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు, అధికారులు

రాంబిల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజిరెడ్డిపాలెం వద్ద ఏర్పాటు కానున్న రెన్యూ సోలార్‌ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, ఆర్డీవో వీవీ రమణ, స్థానిక తహశీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో జయమాధవి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు పప్పల నూకన్నదొర, వి.దిన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 01:10 AM