Share News

మారిన పాలన.. బాగుపడిన రోడ్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:38 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో దయనీయంగా ఉన్న గ్రామీణ రహదారుల పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగుపడుతున్నది. ఐదేళ్ల వైసీపీ హయాంలో గోతులమయంగా మారిన అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడిన ప్రజలు.. ఇప్పుడు చక్కగా రూపుదిద్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

 మారిన పాలన.. బాగుపడిన రోడ్లు

చోడవరం- గవరవరం మధ్య పూర్తయిన తారు రోడ్డు నిర్మాణం

తొమ్మిది కిలోమీటర్లు.. రూ.2.5 కోట్ల వ్యయం

వాహనదారులకు తీరిన కష్టాలు

చోడవరం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో దయనీయంగా ఉన్న గ్రామీణ రహదారుల పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగుపడుతున్నది. ఐదేళ్ల వైసీపీ హయాంలో గోతులమయంగా మారిన అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడిన ప్రజలు.. ఇప్పుడు చక్కగా రూపుదిద్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. చోడవరం- దేవరాపల్లి మార్గంలో స్థానిక కొత్తూరు జంక్షన్‌ నుంచి గవరవరం వరకు రహదారి అభివృద్ధి పనులను రెండున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు. సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవు వున్న ఈ రహదారి పనులను నెల రోజుల్లో పూర్తి చేశారు. పట్టణ పరిధిలో కొత్తూరు జంక్ష న్‌, అన్నవరం వద్ద నిన్నమొన్నటి వరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్డును.. బీటీతో అభివృద్ధి చేయడంతో వాహనదారుల ఊరట చెందుతున్నారు. తారు రోడ్డుపై కుదుపులు లేకుండా సాఫీగా ప్రయాణిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:38 AM