Share News

బీఎల్‌వో శిరిషకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:10 PM

ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన హుకుంపేట మండలం సంతారిలోని 113వ పోలింగ్‌ కేంద్రం బీఎల్‌వో వంపూరు శిరీష రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల ప్లెజ్డెస్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

బీఎల్‌వో శిరిషకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
బీఎల్‌వో శిరీష

ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

అరకులోయ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన హుకుంపేట మండలం సంతారిలోని 113వ పోలింగ్‌ కేంద్రం బీఎల్‌వో వంపూరు శిరీష రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల ప్లెజ్డెస్‌ అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాదికి సంబంధించి ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు, ఇతర ఎన్నికల విధుల్లో ఆమె చూపిన చొరవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. శిరీష ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల అరకులోయ తహశీల్దార్‌, ఏఈఆర్‌వో హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆమెకు అవార్డు రావడంపై రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 21 , 2026 | 11:10 PM