ఆయుర్వేద ఆస్పత్రి పునఃప్రారంభానికి సిద్ధం
ABN , Publish Date - May 20 , 2026 | 11:36 PM
అరకులోయ టీటీడీ కల్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి భవనం కొత్త రూపు సంతరించుకుని పునఃప్రారంభానికి సిద్ధమైంది.
రూ.30 లక్షలతో ఆధునికీకరణ
అరకులోయ, మే 20 (ఆంధ్రజ్యోతి): అరకులోయ టీటీడీ కల్యాణ మండపాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి భవనం కొత్త రూపు సంతరించుకుని పునఃప్రారంభానికి సిద్ధమైంది. నాలుగు నెలల కిత్రం ఈ ఆస్పత్రి భవనం మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఆయూష్ మిషన్ నుంచి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మెడికల్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. భవనాన్ని సరికొత్తగా తయారు చేశారు. ఇది ఇప్పుడు పునఃప్రారంభానికి సిద్ధంగా ఉంది.