అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:40 AM
మండలంలోని బంగారమ్మపేట నుంచి మునసల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో పలు చోట్ల భారీ గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
గోతులమయంగా బంగారమ్మపేట- మునసల రోడ్డు
29 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
కొయ్యూరు, ఆగస్ట్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బంగారమ్మపేట నుంచి మునసల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో పలు చోట్ల భారీ గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. 17 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
సుమారు 29 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ఈ రహదారిని 2009లో నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఈ రోడ్డుకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో బంగారమ్మపేట నుంచి పరదేశిపాకలు గ్రామం వరకు భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతుల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే అంతాడ- రాజుపేట మధ్య రహదారి కోతకు గురికావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని 29 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.