Share News

పక్కాగా టెన్త్‌ మూల్యాంకనం

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:00 AM

స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ టి.నిశాంతి సూచించారు.

పక్కాగా టెన్త్‌ మూల్యాంకనం
పాడేరులో టెన్త్‌ మూల్యాంకనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ టి.నిశాంతి

కలెక్టర్‌ టి.నిశాంతి సూచన

పాడేరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ టి.నిశాంతి సూచించారు. గురువారం మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు. తొలి రోజు ఈ కేంద్రానికి ప్రైవేటు వ్యక్తులు రావడం, వీడియోలు తీయడంతో పాటు మౌలిక సదుపాయాల సమస్య కలెక్టర్‌ దృష్టికి రావడంతో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని విద్యాశాఖాధికారులను ఆమె ఆదేశించారు. ఈ కేంద్రంలో మొత్తం లక్షా 7 వేల 581 పరీక్షా పత్రాలను ఈ నెల 6 నుంచి 15 వరకు మూల్యాంకనం చేస్తామని, ప్రస్తుతానికి 36 వేల 992 పత్రాల మూల్యాంకనం పూర్తయిందని కలెక్టర్‌కు డీఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్‌ శశికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:00 AM