నాణ్యతతో పనులు చేయాలి
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:02 AM
నాణ్యతతో పనులు చేయాలని పలాస-కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు కోరారు.
పలాస, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): నాణ్యతతో పనులు చేయాలని పలాస-కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు కోరారు. శనివారం స్థానిక అన్నపూర్ణ ఆశ్రమ వీధిలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముని సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పనులపై నిరంతరం పర్యవేక్షిం చాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఈ కిరణ్కుమార్, సిబ్బంది ఉన్నారు.