కార్మికులకు వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:46 PM
: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకు లాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, బకాయి వేతనాలు చెల్లించాలని గురుకులాల కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకు లాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, బకాయి వేతనాలు చెల్లించాలని గురుకులాల కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద వారు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి.గణేష్, సీతామహాలక్ష్మి , బి.పార్వతి, మంజు, లక్ష్మి, అవి నాష్, సురేంద్ర, మోహన్, రజనీ, జయంతి, సుబ్బలక్ష్మి, హేమలత పాల్గొన్నారు.